భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశానికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని శాశ్వత పథకంగా మార్చాలని మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్(MoD) నిర్ణయించింది. ‘ఇది దేశ ‘నారీ శక్తి’ సామర్థ్యం, మహిళా సాధికారత పట్ల మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిబద్ధతకు నిదర్శనం” అని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలోని మూడు సర్వీసుల్లోకీ మహిళల రిక్రూట్ మెంట్ కు సంబంధించి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన తరువాత రక్షణశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
2018లో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ అవనీ చతుర్వేది ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తన మొదటి సోలో ఫ్లైట్ MiG-21 బైసన్ను నడిపింది.
ప్రయోగాత్మక ప్రాతిపదికన మహిళల కోసం ఫైటర్ స్ట్రీమ్ను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన ఏడాదిలో జూలై 2016లో ఫ్లయింగ్ ఆఫీసర్లగా నియామకం అయిన ముగ్గురు సభ్యుల మహిళా బృందంలో అవని చతుర్వేది ఒకరు. 2020లో నౌకాదళం తన మొదటి బ్యాచ్ మహిళా పైలట్లను డోర్నియర్ మారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది.
https://twitter.com/rajnathsingh/status/1488498448085045248?s=20&t=On8CN3CSFXk0zUjSjgwhrg