
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం కాశ్మీర్లో ఉన్న పార్టీల వ్యవహారం ఎట్లా ఉండేదంటే అధికారంలో ఉన్న పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండేవారు, అదే ప్రతిపక్షంలో ఉంటే పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంటూ పాకిస్తాన ను పొగిడేవారు. నరేంద్ర మోడీ పరిపాలన లోకి వచ్చిన తర్వాత పాలనలో తెచ్చిన సమూల మార్పులు , కశ్మిర్ పై ఒక స్పష్టమైన వైఖిరి తో వ్యవహరించటం ప్రారంభమైంది, దీనితో కశ్మీర్ లోని నాయకులు గతంలో వ్యవహరించినట్లు గా వ్యవహరించడం సాధ్యం కావడం లేదు. దశాబ్దాలుగా మారణకాండతో నలిగిపోయిన కాశ్మీర్ రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అక్కడి నాయకులు తాము ఈ దేశం సమర్థ కుల లేక పాకిస్థాన్ ప్రేమికుల తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఈ మార్పుకు కు దారి తీసిన సంఘటన పుల్వామాలో సైనిక వాహనాలపై ఉగ్రవాదుల దాడి, ఆ సమయంలో కేంద్రం తీసుకున్న కఠిన వైఖరి, ఆ దాడికి కేంద్రం చెప్పిన గట్టి సమాధానం అక్కడి రాజకీయ నాయకు లను సందిగ్ధంలో పడేసింది. ముఖ్యంగా పీడీపీపార్టీ ని ప్రశ్నార్ధకం లోకి నెట్టింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి 370 ఆర్టికల్ 35A లను రద్దు చేసింది. దాంతో పాటు అక్కడ శాసనసభ కూడా రద్దు అయిపోయింది, ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది, అక్కడి ప్రముఖ రాజకీయ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది, సుమారుగా ఆ నాయకులు ఒక సంవత్సరం పాటు గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ పరిస్థితిని కాశ్మీరు నాయకులే కాదు దేశంలో కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని సమర్ధించే నాయకులకు కూడా ఊహకు అందకుండా జరిగిపోయింది. అంతకు పూర్వం వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమర్థిస్తూద్వందవైఖిరి తో రాజకీయాలు నడిపి కాశ్మీర్ కు దేశానికి ఎంతో నష్టం చేశారు. ఆ రాజకీయాలు ఉగ్రవాదులకు ఆర్థికంగా నైతికంగాఎట్లా సమర్ధించాయో ఒకసారిపరిశీలిస్తే బాగుంటుంది 2014 పూర్వపు వరకు ఏమి జరిగిందో మనకు అర్థం అవుతుంది.
1989వ సంవత్సరంలో కశ్మీర్లో ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది, దేనికోసం? కశ్మీర్లో వేర్పాటువాదులకు ఉగ్రవాదులకు ప్రత్యక్ష సహకారం అందించేందుకు మరియు అప్పటివరకూ ఉన్నా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నీ అణగద్రొక్కేందుకు ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ప్రారంభించారు. ఫరూక్ అబ్దుల్లా తెరవెనుక ఒక వైఖరి తెరముందు మరో వైఖిరితో రాజకీయాలు నడిపాడుఅందుకే ఆయన పార్టీకి జెండాగా ఎరుపు రంగు ఎంచుకున్నాడు , అదే కొత్తగా ప్రారంభమైన పీడీపీ బహిరంగంగానే వేర్పాటు వాదులకు ఉగ్రవాదులకు పాకిస్థాన కు సానుకూలంగా ఉండటం ప్రారంభించింది అందుకు వ్యూహాత్మకంగా అది ఆకుపచ్చ రంగు జెండాను స్వీకరించింది, ఆ పార్టీ ఎన్నికల గుర్తు గా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ యొక్క పెన్ అండ్ ఇంకు బాటిల్ ఎంచుకుంది . వ్యూహాత్మకంగా భద్రతా దళాలపై, మానవ హక్కుల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేది . 2002లో జరిగిన కశ్మీర్ ఎన్నికలలో ఆ పార్టీ 16 స్థానాలు గెలుచుకుంది అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లా పార్టీ 28 స్థానాలు గెలుచుకుంది మొత్తం స్థానాలు 87. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పీడీపీ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. 2002లో గుజరాత్ లో అక్షరధామ్ ఆలయం పై దాడి చేసిన ఉగ్రవాదులు కుల్గామ్ లోని అబ్దుల్ అజీజ్ ఇంటిలో తలదాచుకున్నట్లుఅదుపులోకి తీసుకొన్నవాళ్ళు చెప్పారు ఆ వార్త పెద్ద దుమారం అయింది. దానికి అబ్దుల్ అజీజ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడుముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అంగీకరించక కొనసాగించాడు. 2009 నుంచి 2014 వరకు ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. 2015 లో బిజెపిమద్దతుతో పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ ఏర్పడింది. పీడీపీ ఉగ్రవాదం తీవ్రవాదం వైపు మొగ్గుచూపటం తో పాటు మసారత్ ఆలం ను జైలు నుండి విడుదల చేయటం వివాదాస్పదమైంది, దానితో బిజెపి మద్దతు ఉపసంహరించుకుంది, ప్రభుత్వం పడిపోయింది.
2019 సంవత్సరంలో జమ్ము శ్రీనగర్ హైవే పైన సి ఆర్ పి ఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది జవాన్లు బలి అయినారు దానితో కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది కాశ్మీర్ గురించి ఆలోచించే విధానంలో లో పూర్తి మార్పు తీసుకుని వచ్చింది, ఉగ్రవాదులను పూర్తిగా ఏరి వేయటం ప్రారంభించింది . ఇంతకు పూర్వం యుద్ధం ఉగ్రవాదులు ప్రారంభించే వాళ్లు, 2019 నుండి భద్రతాదళాల ఉగ్రవాదులను వెతకటం ప్రారంభించింది. ఉగ్ర వాదులను అదుపులోకి తీసుకోవటం లేకపోతే కాల్పుల్లోవాళ్ళు మరణించడం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడం ప్రారంభమైంది. దానితో 1999 నుండి పాలిస్తున్న పాలకుల రాజకీయాలకు తెర పడటం కూడా ప్రారంభమైంది, దీంతో రాజకీయ నాయకులకు వేర్పాటువాదులు ఉగ్రవాదులతో సంబంధాల తీగ కదలటం ప్రారంభమైనది , ఇది ఎంతో కీలక పరిణామము . దీనితో కశ్మీర్లో శాంతి భద్రతలను కాపాడడానికి తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఒక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు పాకిస్థాన్ తో వ్యవహరిస్తున్న కఠిన వైఖరి సరిహద్దుల్లో తాత్కాలికంగా నైనా కాల్పుల విరమణకు అవకాశం ఏర్పడింది. మొత్తం మీద కాశ్మీరును జాతీయ జీవన స్రవంతిలో పూర్తిగా కలిపేందుకు కావలసిన ప్రయత్నాలు వేగంగా జరగటం అందరం స్వాగతించిన వలసిన విషయం.
దేశం ముందుసవాలు విసురుతున్న ఒక ప్రశ్నకు సమాధానం వెతకాలి
మొత్తానికి స్వతంత్రానంతర కాశ్మీర్ చరిత్రను పైపైన చదివిన సమాధానం వెతక వలసిన ఒక ప్రశ్న దేశం ముందుకు వస్తుంది ఈ ప్రశ్న కేవలం కాశ్మీర్ ను చూస్తేనే కాదు అధిక సంఖ్యలోముస్లిం లు ఉన్న ప్రతిచోటా కొద్దో గొప్పో తేడాతో ఆ ప్రశ్న వస్తున్నది అదేమిటంటే మేము మెజారిటీ ఉన్న భూభాగం మాది అక్కడ మాఇష్టానుసారమే జరగాలి లేకపోతె జిహాదే. ఇక్కడే 1940మార్చి 23న ముస్లిం లీగ్ లాహోర్ లో చేసిన తీర్మానం గుర్తు చేసుకోవాలి.ఆ తీర్మానం లో ”ముస్లిం జనాభా మెజారిటీ ఉన్నఅన్ని చోట్లఇస్లాం రాజ్యాలు ఏర్పాటు చేయాలనీ ”పిలుపు నిచ్చారు. దీని అర్ధం ఈ దేశంలో ప్రత్యేక ముస్లిం దేశాలు కావాలి. దానికోసం చేయవలసిన పనులు చేయాలి. ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని కశ్మీర్ పరిణామాలను విశ్లేషిస్తే ” ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా సలహామేరకు నెహ్రు కశ్మీర్ రాజు తో ” కాశ్మిర్ ను ఇండియన్ యూనియన్లో విలీనం చేసినవెంటనే నీవు కాశ్మీరును విడిచి వెళ్లిపోవాలని” కండీషన్ పెట్టాడు. దానిప్రకారం కాశ్మీర్ రాజు ముంబయి వెళ్ళిపోయాడు. దానితో షేక్ అబ్దుల్లానే పాలనా చేపట్టాడు. కాశ్మీర్ పాకిస్తాన్ లో కలిపితే తన అధికారానికి ఎసరు వస్తుంది , భారత్ లో పూర్తిగా కలిపితే ముస్లిం ఆధిపత్యం ఉండదు అందుకే మద్యేమార్గం గా ప్రత్యేక ప్రతిపత్తికోరి సాధించుకొన్నాడు . అట్లా ముస్లిం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. అక్కడ జరుగుతున్నా వేర్పాటువాద ,ఉగ్రవాద కార్యకలాపాల సారాంశం కూడా ఒకటే కాశ్మీర్ స్వతంత్రదేశం గాఉండాలా , లేక పాకిస్తాన్ లో కలపాలా అంతేకాని భారత్ లోఉండే ప్రశ్నే లేదు, అక్కడి రాజకీయాలు కూడా దీనిచుట్టనే తిరిగాయి.ఈ ఆలోచనలు విసురుతున్న సవాళ్లకు సమాధానాలు వెతకాలి, 370 ఆర్టికల్ 35ఏ రద్దు ఒకతాత్కాలిక చర్యమాత్రమే కాశ్మీర్ జాతీయజీవన స్రవంతిలోకలవాలంటే ఇంకా ఏదో చేయాలి దానిగురించి ఆలోచించాలి , దానితో మరన్ని స్వతంత్ర ఆలోచనలు తలెత్తకుండా నివారించవచ్చు దీనికోసం ప్రభుత్వమేకాదు దేశప్రజలందరూ ఆలోచించాలి .