యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకున్న అలనాటి సావిత్రితో ఇప్పుడు అర్పితను పోలుస్తున్నారంతా. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్ అజయ్ భార్యే అర్పిత. పసిబిడ్డను ఎత్తుకొని అడవి లోకి వెళ్లిన ఆమె పోరాటం ఫలించింది. చత్తీస్ఘడ్లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన PMGSY సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. బీజాపూర్లో ప్రజాకోర్టు నిర్వహించిన తరువాత ఇంజనీర్ను విడుదల చేశారు మావోయిస్టులు. తన భర్తను వెతుక్కుంటూ అడవి లోకి వెళ్లారు అజయ్ రోషన్ భార్య అర్పిత. వారం రోజుల పాటు అర్పిత చేసిన పోరాటం ఫలించింది. అర్పిత చేసిన పోరాటం మావోయిస్టుల హృదయాలను కదిలించింది. దీంతో అజయ్ రోషన్ను విడుదల చేశారు. వారం రోజుల పాటు మావోయిస్టుల చెరలోనే ఉన్నారు అజయ్ రోషన్.
బీజాపూర్ జిల్లా మాన్ కేళి, ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులను గత గురువారం పరిశీలించడానికి వెళ్ళినప్పుడు సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్తో పాటు అటెండర్ను కిడ్నాప్ చేశారు. అటెండర్ లక్ష్మణ్ ను విడిచిపెట్టి అజయ్రోషన్ను మాత్రం వారం రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకున్నారు. చివరకు ఆయన కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.