రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం దావా కేసును ఫిబ్రవరి 5న విచారించనుంది థానే కోర్టు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులను త్వరితగతిన పరిష్కరించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవలే ఉత్తర్వులిచ్చింది. రాహుల్ గాంధీపైన ఉన్న కేసులు కూడా అదే కేటగిరీకి వస్తాయని..ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన విచారణ జరపుతున్నట్టు థానెజిల్లా కోర్టు తెలిపింది.
అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాహుల్ గాంధీ మీద వేసిన కేసును ఫిబ్రవరి 5న విచారించనున్నట్టు థానే జిల్లా కోర్టు వెల్లడించింది. ఈమేరకు భివాండి, జెవి పాలివాల్లోని సివిల్ కోర్టు న్యాయమూర్తి , జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ …జెఎమ్ఎఫ్సి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారు తరపు న్యాయవాది ప్రబోధ్ జయవంత్, రాహుల్ తరపు న్యాయవాది నారాయణ అయ్యర్ రోజువారీ విచారణకు సిద్ధమయ్యారో లేదో తెలుసుకోవాలనీ మెజిస్ట్రేట్ కోరింది. 2014లో బివాండీ టౌన్ షిప్ లో ఓ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ మహాత్మాగాంధీ హత్య వెనక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే పరువునష్టం దావా వేశారు.