ఓట్లకోసం, అధికారం కోసం ప్రజలకు ఉచితాలిచ్చే పద్ధతి సరికాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అది దేశాభివృద్ధికి చాలా ప్రమాదమనీ ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేరి గ్రామంలో నాలుగు లేన్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని.
యూపీలో సరైన విధంగా రహదారుల అనుసంధానం జరక్కపోవడానికి కారణం గత ప్రభుత్వాలేనన్న మోదీ..ప్రస్తుతం కేంద్రం,రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండి…డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే వల్ల చిత్రకూట్-ఢిల్లీ మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో మూడు నుంచి నాలుగు గంటల సమయం ఆదా కానుంది.
ఈ ఎక్స్ప్రెస్వే కేవలం వాహనాల వేగాన్ని పెంచడం మాత్రమే కాకుండా యావత్తు బుందేల్ఖండ్లో పారిశ్రామిక అభివృద్ధి పుంజుకుంటుందని మోదీ ఆకాంక్షించారు. ఉచితహామీలు ఇచ్చే పార్టీల పట్ల ప్రజలు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని..అసలా పద్ధతే సరికాదని హెచ్చరించారు.
https://twitter.com/PMOIndia/status/1548206191599579136?s=20&t=o9vpTCkUAhnr4RXMr1yn0A