గుండెపోటు వార్తలపై విక్రమ్ స్పందించాడు. మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్ల క్రియేటివిటీ చాలా బాగుందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన గుండెపోటులో కుప్పకూలారని…ఐసీయూలో చికిత్స పొందుతున్నారని మీడియా హడావుడి చేసింది. ఈ వార్తలను విక్రమ్ కుమారుడు ధ్రువ్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆ రోజే ఖండించగా…పూర్తిగా కోలుకుని ఇంటికి చేరిన విక్రమ్ సైతం స్పందించాడు. జబ్బుతో ఆస్పత్రి ఐసీయూలో ఉన్న వాళ్లకు నా మొహం మార్ఫ్ చేశారని…ఆ ఫొటోపై రకరకాల థంబ్నైల్స్ పెట్టారని..అన్నీ చూశానని..నిజంగా అవాక్కయ్యానని విక్రమ్ అన్నాడు.వాళ్ల క్రియేటివిటీకి థ్యాంక్స్ చెప్పాలనీ అన్నాడు. అయితే అవన్నీచూసి తానేం ఆందోళన చెందలేదని…కుటుంబం స్నేహితులు, అభిమానులు నాకు అండగా ఉన్నారని ఉద్వేగంతో అన్నాడు విక్రమ్.