నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆమెను అరెస్ట్ చేసి స్వతంత్రదర్యాప్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించేందుకు సీజేఐ జస్టిస్ యు. యు లలిత్ నేతృత్వంలోని బెంచ్ విముఖత వ్యక్తం చేసింది. మాబ్ లించింగ్ నియంత్రణకు సంబంధించి తహసీన్ పొన్నవాలా తీర్పులోని ఆదేశాలను అమలు చేయాలని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఇది చాలా సరళమైనదిగా, హానికరం కానిదిగా కనిపించొచ్చని, కానీ చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటుందని ధర్మాసనం. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ అబు సోహెల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, నుపుర్ శర్మపై గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి తగిన పరిష్కారం కోరాలని శర్మకు సూచించింది.