2015నాటి అల్లర్ల కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను దోషులుగా తేల్చింది కోర్టు. అఖిలేష్ త్రిపాఠీ, సంజీవ్ ఝాలతో పాటు మరో 15 మంది ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందిపై దాడి చేసినట్టు రూస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తేల్చింది.
2015 ఫిబ్రవరిలో ఢిల్లీలోని బురారీ పోలీస్ స్టేషన్లో నమోదైన కిడ్నాప్ కేసులో …పోలీసులపై దాడి చేసిన గుంపులో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నిందితులను తమకు అప్పగిస్తే తామే శిక్షిస్తామని వారు పోలీసులపై ఒత్తిడితేవడమే కాక దాడి చేశారు. అంతేకాక అక్కడున్న వారందరినీ రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించినట్టు నిర్థారణ అయింది. ఆ అల్లర్లకు మూలకారకులు ఎమ్మెల్యేలను కోర్టు అభిప్రాయపడింది.
ఆప్ ను కష్టాలు వీడడం లేదు. ఇప్పటికే ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ మనీ లాండరిగ్ కేసులో కస్టడీలో ఉన్నారు. ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఇరుక్కున్నారు.