పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ కీ అవినీతి కేసులో దోషి అని తేల్చిన….ఆ దేశ సైనిక కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెపై విచారణ జరిగిన అనేక క్రిమినల్ కేసుల్లో ఇది చివరిది. ఆమె ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, 2021 ఫిబ్రవరిలో ఆమె ప్రభుత్వాన్ని సైన్యం కూల్చివేసింది. ప్రస్తుతం ఆ దేశంలో సైనిక పరిపాలన కొనసాగుతోంది. కోర్టు తాజా తీర్పుతో ఆమె మొత్తం 33 సంవత్సరాలపాటు జైలు జీవితం గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఐదు నేరారోపణ కేసుల్లో ఒక్కో కేసులో దాదాపు 15 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించదగినదని కోర్టు తెలిపింది.