హైదరాబాద్ లో పేలుళ్ల కోసం భారీ కుట్ర ను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీళ్ళ దగ్గర నుంచి కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితులు సిరాజ్, సమీర్ రిమాండు రిపోర్ట్ లో కీలక విషయాలు ఉన్నట్లు సమాచారం. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఇన్ స్టా గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సిరాజ్, సమీర్ సహా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు యువకులు ఉన్నారని పోలీసుల రిమాండు రిపోర్టులో వెల్లడించారు. ఈ ఆరుగురు మూడు రోజులు హైదరాబాద్లో మకాం వేశారు. సౌదీ అరేబియాలో ఐసిస్ ఉగ్రవాదుల నుంచి వీరికి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
వీరిలో ఇద్దరు బాంబులు తయారు చేయడం. మిగిలిన వారు వాటిని హైదరాబాద్ నగరంలో కీలక ప్రాంతాల్లో పెట్టి పేల్చేందుకు ప్రయత్నించారని ప్రాధమిక విచారణలో తేలింది.
ఈ అరెస్టు తో కీలక విషయాలు తెలిసాయి.
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మూలాలు గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.