ప్రధాని మోదీ కర్నాటకలో పర్యటించారు. యాద్గిర్ జిల్లాలో నీటి పారుదల, తాగునీరుకు సంబంధించిపలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న పాతికేళ్లు ప్రతిభారతీయుడికి, దేశానికి అమృతకాలమని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించుకునే సమయం ఇదే అన్నారు. 21 శతాబ్దంలో నీటిభద్రత ఎంతో అవసరమనీ మోదీ అన్నారు. కర్నాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. 224 స్థానాలుండగా 150 స్థానాలు లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పార్టీ పిలుపునిచ్చింది. దక్షిణాదిలో ఏలుబడిలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో పార్టీ ఉంది.