పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం CRPF కమాండోల ‘Z’ కేటగిరీ వీఐపీ భద్రతను కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. నెలకు ₹ 15-20 లక్షలు ఖర్చవుతుందని.. ఖర్చు అదానీయే భరిస్తారని వారు చెప్పారు. 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉండనున్నారు.
దేశంలో భద్రతాపరమైన ముప్పు పొంచిఉన్న వ్యక్తుల నివేదికను సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా మిస్టర్ అదానీకి సెంట్రల్ లిస్ట్ కింద భద్రత కల్పించినట్లు వర్గాలు తెలిపాయి.