సోషల్మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలోనే కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారికి ఇక అడ్డుకట్ట పడనుంది. తప్పుడు సమాచారం నుంచి…. తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ మరో పదిరోజుల్లో ఓ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. బ్రాండ్లు, సేవలకు సబంధించిన నకిలీ సమీక్షల నుంచి ఆన్లైన్ వినియోగదారుడిని రక్షించేందుకు.. బ్రాండ్ ఎండార్సర్లు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, బ్లాగర్లను ప్రతిపాదిత ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) గతంలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజా నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి 10 లక్షల జరిమానా విధించనున్నారు. పదేపదే ఉల్లంఘిస్తే 50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫాంలను నియంత్రించడానికి, సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేసే వారి ఖాతాలను తొలగించడానికి త్వరలోనే ఒక విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్రం బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న విధానం తాత్కాలికమేనని, కాబట్టి సోషల్ మీడియా ఖాతాల సస్పెన్షన్ కేసులనుప్రస్తుత నిబంధనల ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది.