జమిలి ఎన్నికల మీద గందరగోళం చేయాలి అనుకొన్న ప్రతిపక్షాల నోటికి తాళం పడింది. ఎటువంటి కన్ ఫ్యూజన్ లేకుండా పూర్తి స్థాయి స్పష్టతతో బిల్లును నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకొని వచ్చింది. ఈ వివరాల ప్రకారం చూస్తే 2034 వ సంవత్సరంలో అంటే పదేళ్ల తర్వాతనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి దాకా ఇందుకు సంబంధించిన విధి విధానాలను పూర్తి గా పూర్తి చేసేందుకు రంగం సిద్దం చేశారు.
…
అయినప్పటికీ, జమిలి ఎన్నికల మీద సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.
..మొదటి ప్రశ్న..
జమిలి ఎన్నికలను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు?
జవాబు..
జమిలి ఎన్నికల కోసం.. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సమావేశమయ్యే తొలి లోక్సభ సమావేశంలో ఆర్టికల్ 82ఏను రాష్ట్రపతి నోటిఫై చేస్తారు. . ఆ రోజునే అపాయింటెడ్ డేగా తీసుకొంటారు. 18వ లోక్సభ ఎన్నికలు గత మే-జూన్లో జరిగిపోయాయి. గత జూన్లోనే తొలిసారిగా లోక్సభ సమావేశం పూర్తైంది. ఈ లెక్కన 2029లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మే జూన్ మాసంలో నోటిఫై చేస్తారు.
….
రెండో ప్రశ్న..
జమిలి ఎన్నికల సర్దుబాటు కోసం ఎంత సమయం ఇచ్చారు?
జవాబు..
జమిలి ఎన్నికలను నోటిఫై చేశాక, అయిదు సంవత్సరాల గడువు కావాలని నిర్దేశించారు. అయినప్పటికీ, ఇప్పుడే పార్లమెంటు లో బిల్లు ప్రవేశం పెట్టారు. అంటే 2024 నుంచి 29 దాకా అయిదేళ్లు, ఆ తర్వాత 2029 నుంచి 34 దాకా మరో అయిదేళ్లు.. అంటే మొత్తంగా పదేళ్ల పాటు జమిలి ఎన్నికల సర్దుబాటు కోసం సమయం కేటాయించారు.
…
మూడో ప్రశ్న..
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న అసెంబ్లీలను ముందుగానే రద్దు చేస్తారా?
జవాబు..
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా ముందస్తు రద్దు అంశం కనిపించటం లేదు. అసెంబ్లీల కాలపరిమితిని ఈ పదేళ్ల కాలంలోనూ సర్దుబాటు చేసుకొంటూ పోతారు. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఏర్పడక పోవచ్చు. ఈ లోగా విడతల వారీగా అసెంబ్లీ ఎన్నికలను క్రమబద్దం చేస్తారు. అంతిమంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అప్పటికి తీసుకొని వచ్చేస్తారు.
..
నాలుగో ప్రశ్న..
కొన్ని అసెంబ్లీలకు మధ్యంతరం వస్తే పరిస్థితి ఏమిటి?
జవాబు..
లోక్సభ లేదా అసెంబ్లీ.. మధ్యలో రద్దెతే మిగిలిన కాలాన్ని వీగిపోని కాలంగా పరిగణిస్తారు. సభ రద్దెన తర్వాత మిడ్టర్మ్ ఎన్నికలతో కొత్త సభ కొలువుదీరుతుంది. అలా ఏర్పడిన కొత్త సభ మిగిలిన కాలానికి మాత్రమే అంటే.. ఐదేండ్ల కంటే తక్కువగా ఉంటుంది. మధ్యంతర మధ్యంతర ఎన్నికల ద్వారా కొలువుదీరిన సభ.. అయిదేళ్ల పాటు కొనసాగే ఛాన్స్ లేదు. అంతకు ముందు రద్దయిన కాలంతో కలిపి మొత్తంగా ఐదు ఏండ్లు పూర్తికాగానే ఎన్నికలు వచ్చేస్తాయి.
…
అయిదో ప్రశ్న..
రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేస్తారా?
జవాబు..
జమిలి ఎన్నికల స్వరూపంలో రాష్ట్రాల అధికారాలను కుదించే మాట ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తోంది. ఇక ముందు కూడా అదే పద్దతి కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియలో ఏమాత్రం మార్పులు చేయటం లేదు. అలాగే మధ్యంతర ఎన్నికలకు కూడా అవకాశం ఇస్తున్నారు. అయితే స్వల్ప కాలం ఉండగానే ప్రభుత్వం పడిపోతే మాత్రం రాష్ట్రపతి పాలనకు ఆస్కారం ఏర్పడుతుంది.
…….
మొత్తం మీద జమిలి ఎన్నికల బిల్లును నెగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా పనిచేసింది. ముందుగానే బీజేపీకి కలిసి వచ్చే పార్టీలను అప్రమత్తం చేశారు. కూటమిలోని పార్టీలతో పాటు తటస్థంగా ఉండే వైసీపీ వంటి పార్టీలు కూడా జమిలికి జై కొట్టాయి. దీంతో ఈ బిల్లు పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపించారు. తర్వాత దీనిని చట్టంగా మార్చేందుకు వీలు కల్పించారు.
Youtube Video :