
File Photo
క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ నెల 11న జాతీయ సంతాప దినంగాపాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న క్వీన్ స్కాట్లాండ్లోని బల్మోరా కేజిల్లో చనిపోయిన సంగతితెలిసిందే. ఎలిజబెత్ అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహంచేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం, ఆమె మరణించిననాటి నుంచి 11 రోజులకు అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. ఎలిజబెత్ మృతి సందర్భంగా… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇచ్చిన సంతాప సందేశంలో ఆమె మరణవార్త కలిచివేసిందన్నారు. ఆమె తన దేశానికి, ప్రజలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్నిచ్చారన్నారు. ప్రజా జీవితంలో హుందాతనం, మర్యాదలకు ఆమె నిలువెత్తు రూపమని పేర్కొన్నారు. ఆమె గౌరవార్థం సెప్టెంబర్ 11న జాతీయ సంతాపదినంగా పాటించనున్నట్టు విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.