ఇరవై ఏళ్ల తరువాత తమిళనాడులో బీజేపీ మళ్లీ ఖాతా తెరిచింది. 2001 ఎన్నికల తరువాత ఈసారి మళ్లీ నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచారు. సరస్వతి ఈరోడ్ నుంచి, ఎంఆర్ గాంధీ నాగర్ కోయల్ నుంచి, వనతి శ్రీనివాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి నైనర్ నాగేంద్రం తిరునల్వేలినుంచి గెలుపొందారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలైన వనతి నటుడు కమల్ హాసన్ ను ఓడించారు.
2001 ఎన్నికలలో నలుగురు ఎమ్యెల్యేలను గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికలలో కూడా ఒక్క ఎమ్యెల్యేని కూడా గెలిపించుకోలేక పోయింది. అంతకు ముందు తొలిసారిగా 1996లో ఒకే ఒక్క సీటును గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో బోణీకొట్టింది.