కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఉనికి చాటుకుంది. మొత్తం 42 వార్డులకు ఎన్నికలు జరగ్గా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ 24 వార్డులు, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 12 వార్డులు గెలుచుకోగా..ఎన్డీఏ 6 వార్డులు దక్కించుకుంది.
ఇక కీలకమైన ఎర్నాకులంలో బీజేపీ అభ్యర్థుల విజయం అనూహ్యమనే చెప్పాలి. స్థానిక సంస్థల ఉపఎన్నికలో బీజేపీ ఐదుస్థానాలకు మూడింటిని గెలుచుకుంది.కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్లోని ఎర్నాకులం సౌత్, త్రిప్పునితుర మున్సిపాలిటీలోని ఇలమనతోప్పు సహా పిషారికోవిల్ వార్డులను బీజేపీ చేజిక్కించుకుంది. త్రిప్పునితుర మునిసిపాలిటీలో LDF తన రెండు స్థానాలను నిలబెట్టుకోవడంలో విఫలమవడంతో ఇప్పుడు మెజారిటీ కోల్పోయింది.
వాయనాడ్, కాసర్గోడ్ మినహా 12 జిల్లాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వార్డుల్లో మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. 2 మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు, 7 మున్సిపల్ వార్డులు, రెండు బ్లాక్ పంచాయతీ డివిజన్లు, 31 పంచాయతీ వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి.