‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఆపేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అనే డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కార్యాచరణకు సమాయత్తం అవుతున్నది. అధికారులు అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో భగవద్గీత పఠన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కూడా స్పష్టం చేస్తున్నది.
ఈ విషయమై, 15 మంది ఎంపీల బృందం త్వరలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు వీహెచ్పీ జాతీయ కార్యదర్శి ఆచార్య రాధాకృష్ణ మనోడి తెలిపారు.