తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది..ఉదయం పదిగంటలకే రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి..ఎక్కడివాళ్లక్కడే గప్ చుప్ అన్నట్టు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు..రోడ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు అన్నీ నిర్మానుష్యమయ్యాయి.
హైదరాబాద్ లో లాక డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నారు..రద్దీగా ఉంటే అమీర్పేట, కోఠి, చార్మినార్ సహా అంతటా జనసంచారం నిలిచిపోయింది. నిబంధనల్ని కఠినంగా అమలుచేస్తున్న పోలీసులు కూడళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యవసర సేవల్ని మాత్రమే అనుమతిస్తున్నారు…అటు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు, వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.