నాపై విమర్శలు చేసేవారికి తాను తీసుకున్న అవార్డే తగిన సమాధానం చెప్తుందని బాలీవుడ్ నటి కంగనారనౌత్ అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా కంగనా పద్మశ్రీ అందుకున్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో మెసేజ్ షేర్ చేశారు. నటిగా ఎన్నో అవార్డులు అందుకున్నా పద్మ అవార్డు తీసుకుంటున్నప్పుడు కలిగిన ఆనందం వేరని కంగనా అన్నారు. చిన్నవయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి 8 నుంచి పదేళ్లు పట్టిందని అన్నారు.
అయితే సినిమారంగంలో డబ్బుకన్నా కూడా శత్రువులను ఎక్కువగా సంపాదించుకున్నానని… సామాజిక, రాజకీయ అంశాలపై స్పందింస్తుంటే ఎన్నో ఆరోపణలు, విమర్శలు గుప్పించారని కేసులు సైతం వేశారని …అయితే అందరికీ ,అన్నింటికీ నేను అందుకున్నఅవార్డే సమాధానమని కంగనా ఇన్ స్టాలో పేర్కొన్నారు.