కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించాలంటూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఎన్. రంగసామి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నిపార్టీలు మద్దతిచ్చాయి. దీంతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ప్రతిపక్ష నేత శివ, డీఎంకే ఎమ్మెల్యేలు నాజిమ్, హనిఫాల్ కెనడీ, సెంధిల్కుమార్, బీజేపీ సభ్యులు, ఎన్నార్ కాంగ్రెస్ సభ్యులు సీఎం రంగస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.