ఆదానీ అంశం పార్లమెంట్ ను ఇవాళ కూడా కుదిపేస్తోంది. హిండెన్బర్గ్ నివేదికపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూప్ షేర్ల విలువ పతనమవడం అతి పెద్ద కుంభకోణమని మండిపడ్డాయి. ఇంతటిమోసానికి పాల్పడ్డ అదానీ గ్రూప్పై ఏం చర్యలు తీసుకున్నారో…తీసుకోనున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఈ అంశంపైనే రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన థాకరే వర్గం, బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. ఆ నోటీసులను అనుమతించడం లేదని ధనకర్ ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.ఈ వ్యవహారంలో మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారుకొంది. . అయితే ఖర్గే ఆరోపణలపై నిర్మల అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలనే రగడ చేస్తున్నారని మండిపడ్డారు. అటు రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ గ్రూప్ అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది.