రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇటీవలే కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠిన హృదయుడని తాను అనుకునేవాడినని ఆయన ఎంత సున్నితమనస్కుడో ఈమధ్యే తెలిసిందని వ్యాఖ్యానించారు. రాజ్యసభసభ్యుడిగా ఆజాద్ వీడ్కోలు సందర్భంగా ఏడాదిక్రితం మోదీ తీవ్ర ఉద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సందర్భాన్ని తాజాగా గుర్తుచేసుకుంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు ఆజాద్.
2006లో ఆజాద్ జమ్ముకశ్మీర్ సీఎంగా ఉన్నసమయంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఆఘటనలో గుజరాత్ కు చెందినవాళ్లు చనిపోయారు.అప్పుడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఆ ఘటన జరిగిన మరుక్షణం నుంచి మోదీ తరచూ తనకు ఫోన్ చేస్తూ ఘటన గురించి తీసుకోవల్సిన చర్యలు, బాధితుల సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారు. హత్యలవెనక క్రూరత్వం తలుచుకుని ఆజాద్ పైకి ఏడ్చేశారు. ఆ ఏడుపు మోదీకి వినబడింది. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆజాద్ కంటనీరు పెట్టుకున్నారని.. గాయపడినవారిని బతికించేందుకు అందర్నీ పరుగులుపెట్టించారని…ఆజాద్ గొప్ప మానవతావాది అని ఏడాది క్రితం పార్లమెంట్లో మోదీ గుర్తు చేసుకున్నారు. అయితే మోదీ కఠినాత్ముడు అనుకున్నానని..కానీ గొప్పమానవతామూర్తి అని నాటి ఘటనను తాజాగా గుర్తుచేసుకుని మోదీని కొనియాడారు ఆజాద్. రాహుల్ గాంధీ తీరు సరిగా లేదని..సీనియర్లను పట్టించుకోవడం లేదని..ఆయనవల్లే పార్టీ పతనావస్థకు చేరుకుందని ఆరోపిస్తూ ఇటీవలే పార్టీకి ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కొత్తపార్టీ పెట్టవచ్చనే ప్రచారం జరుగుతోంది.
https://twitter.com/ANI/status/1564151349624745984?s=20&t=X8xClSHajffN_PzugzNCVw