పంజాబ్ లో ఈ సారి కూడా బీజేపీకి ప్రతికూల ఫలితాలే ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో సిక్కు నాయకుడు కెనడాలో స్థిరపడిన వ్యాపారవేత్త రిపుదమన్ సింగ్ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. సిక్కు సమాజం కోసం ఎన్నో సానుకూల చర్యలు తీసుకున్న మోదీని ప్రశంసిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు రిపుదమన్. అంతే కాదు మోదీకి అండగా ఉండి దేశం కోసం పనిచేయాలంటూ సిక్కు సమాజానికీ పిలుపునిస్తూ మరో లేఖ రాశారు. మోదీని కొందరు సిక్కులు అన్యాయంగా విమర్శించడం నచ్చడం లేదని… మోదీ నేతృత్వంలో భారత దేశం అన్నిరంగాల్లో పురోగమిస్తున్నదనే విషయం గ్రహించాలని తోటి సిక్కులకు హితవు పలికారు రిపుదమన్.
ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎయిరిండియా విమానంపైకి ఎక్కి కనిష్క విమానంపై దాడి చేసి 300 మంది ప్రాణాలు బలికొన్న ఘటనకు సబంధించి నిందితుల్లో రిపుదమన్ సింగ్ మాలిక్ ఒకరు. 2005లో కెనడా కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసింది. చాలాకాలంగా ఆయన కెనడాలోనే ఉంటున్నారు. ఇప్పుడు పంజాబ్ ఎన్నికల వేళ మోదీ ప్రభుత్వం సిక్కుల కోసం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ హృదయ పూర్వక కృతజ్ఞతలంటూ లేఖరాశారు.
ప్రధానికి రాసిన లేఖలో మాలిక్ “వేలాది సిక్కుల భారతదేశ సందర్శనను పరిమితం చేసిన బ్లాక్లిస్ట్ల తొలగింపు సహా సిక్కుల మనోభావాల్ని గౌరవిస్తూ వారి దీర్ఘకాలిక డిమాండ్లు, సమస్యలను పరిష్కరించేందుకు మీరు ఎన్నో చర్యలు తీసుకున్నారు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. విదేశాల్లో నివసిస్తున్న వారికి…శరణార్థుల కుటుంబాలకు పాస్పోర్ట్లు, వీసాలు మంజూరు చేయడం, 1984-అల్లర్లు సందర్భంగా మూసివేసిన వందలాది కేసులను తిరిగి తెరవడం, నిర్దోషులకు విముక్తి కలిగిస్తూ అసలైన నిందితులకు శిక్షపడేలా చేయడంలో మీరు చేసిన మేలు సిక్కు సమాజం ఎన్నటికీ మరువనిది. 1984 అల్లర్లను మారణహోమంగా ప్రకటించి…నాటి అల్లర్ల బాధితుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇప్పించారు. భారతదేశపు సిక్కులు సందర్శించుకునేలా గురునానక్ దేవ్ పూజనీయ స్థలాన్ని దర్శించేలా కర్తార్ పూర్ సాహెబ్ కారిడార్ ను ప్రారంభించారు. గురు గోవింద్ సింగ్ కుమారుల బలిదానాన్ని స్మరించుకుంటూ డిసెంబర్ 26 ను వీర్ బాల్ దివస్ గా ప్రకటించడం గొప్ప విషయం. అందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పక తప్పదు’ అన్నారు.
భారతదేశానికి, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిక్కు సంఘం సభ్యులు చేస్తున్న “ఆర్కెస్ట్రేటెడ్ ప్రచారం”పై రిపుదమన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ను అస్థిరపరిచేందుకు కొన్ని విదేశీ శక్తుల ప్రోద్బలంతోనే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇది భారతదేశ జాతీయ సమగ్రతకు సవాలు అని, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాననీ ఆయన అన్నారు.
సిక్కు సమాజం ప్రయోజనాలను దెబ్బతీసే ప్రేరేపిత శక్తులు, దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ సిక్కు కమ్యూనిటీకి మరో లేఖ రాశారాయన. “పంజాబ్లో హింస పంజాబ్ మరియు భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. హింస కారణంగా నా సిక్కులే కాదు మరెవరూ బాధపడడం నేను చూడలేను. ప్రపంచ శాంతి కోసం రోజూ ప్రార్థన చేస్తున్నా. సిక్కు కమ్యూనిటీకోసం ఎంతో చేసిన మోదీని విమర్శించడం తగదు. ఆయన నాయకత్వంలో దేశం కోసం మనందరం పనిచేద్దాం’ అని రిపుదమన్ సింగ్ అన్నారు.
మోదీ ప్రభుత్వం సిక్కుల బ్లాక్లిస్ట్ను రద్దు చేసిన తర్వాత …2019లో ఓసారి రిపుదమన్ భారత్ ను సందర్శించారు. 25 ఏళ్ల తరువాత స్వదేశం వచ్చానని మోదీ సర్కారు బ్లాక్ లిస్టును రద్దు చేయడం వల్లే జన్మభూమిపై కాలుపెట్టే అవకాశం నాకు దక్కిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో కెనడా కూడా గుర్తించిన US నో-ఫ్లై లిస్ట్లో అతని పేరు ఉన్నందున అతను ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో భారత్ రావాల్సి వచ్చింది. కనిష్క బాంబు దాడిలో ప్రమేయం ఉన్నందున రిపుదమన్ 2000 నుంచి 2004 వరకు నాలుగేళ్ల కారాగారవాసం అనుభవించారు. నాటి దాడికి ఆర్థికసాయం అందించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అయితే తరువాత అతన్ని నిర్దోషిగా తేల్చింది కెనడా కోర్టు. రిపుదమన్ ప్రస్తుతం కెనడాలో ఖల్సా పాఠశాలలను నడుపుతున్నాడు. అతని పాఠశాలల్లో, వాంకోవర్ ఎడ్యుకేషన్ బోర్డ్ పాఠ్యాంశాలతో పాటు పంజాబీ భాష మరియు సంస్కృతిని విద్యార్థులకు బోధిస్తారు. రిపుదామన్ కెనడాలో మిలియనీర్ వ్యాపారవేత్త.
Canada-based Sikh leader Ripudaman Singh Malik has written a letter to PM @narendramodi for a number of steps taken for the #Sikh community. He expressed his “deep heartfelt gratitude” for the unprecedented positive steps taken by the him. pic.twitter.com/aN8owiH3uM
— Manish Shukla (@manishmedia) January 18, 2022
Plz have second page. pic.twitter.com/C5dQSz9Cf9
— Manish Shukla (@manishmedia) January 19, 2022