ధన్యవాద్ భారత్ …
మేడిన్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్ బ్రెజిల్ చేరింది. దక్షిణ అమెరికాలోని ఈ దేశానికి భారత దేశం 20 లక్షల డోసుల్ని పంపింది. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో చాలా వినూత్నంగా ప్రధాని మోడీకి, భారత దేశానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ సంజీవనిని మోసుకొస్తున్న హనుమాన్ గ్రాఫిక్ చిత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ చిత్రంలోనే పై భాగంలో ధన్యవాద్ భారత్ అనే ఆంగ్ల, హిందీ పదాలున్నాయి. దిగువన బ్రెజిల్ మ్యాపుతో పాటు ఓబ్రిగాడో ఇండియా అనే బ్రెజిల్ భాషలో థ్యాంక్స్ చెప్పే పదం కనిపిస్తుంది.
కరోనా విజృంభించే సమయంలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కోసం బ్రెజిల్ అధ్యక్షుడు కోరారు. ఆనాడు కూడా రామాయణంలోని సంజీవని పర్వత సన్నివేశాన్ని ప్రస్తావించారు. మోడీని హనుమంతుడితో పోల్చారు. ఈనాడు కరోనా వైరస్ ను పంపిన భారత దేశానికి ఘనంగా ధన్యవాదాలు తెలిపారు.