నీట్ పరీక్ష సందర్భంగా కేరళలో కొందరు అమ్మాయిల లోదుస్తులు విప్పించిన వివాదంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బాలికలకు మళ్లీ నీట్ రాసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. కొల్లాంలో పరీక్ష కోసం వచ్చిన విద్యార్థులను లోదుస్తులు విప్పి రావాలంటూ ఓ పరీక్షా కేంద్ర సిబ్బంది ఒత్తిడి చేశారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. బాధితుల ఫిర్యాదుతో పరీక్షా కేంద్రం సిబ్బంది ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మళ్లీ నీట్ పరీక్షకు అవకాశం ఇస్తూ టెస్టింగ్ఏజెన్సీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థులు ఒప్పుకుంటే సెప్టెంబర్ 4న పరీక్ష నిర్వహిస్తామని మెయిల్స్ పంపింది.