జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజులుగా నిత్యం ఎక్కడో ఓ చోట ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం రాత్రి నుంచి రెండో చోట్ల ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
మసీదులో నక్కిన ఉగ్రవాదులు
షోపియాన్లో ఉన్న ఓ మసీదులో ఉగ్రవాదులు దాక్కున్నారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకోవడంతో వారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు చేపట్టిన భద్రతాబలగాలు వరుసగా ఉగ్రవాదులను ఏరిపారేశారు. అంతకుముందు మసీదు పెద్ద వారిని లొంగిపోవాలని సూచించినప్పటికీ.. అతడి మాటలను ఆ ఉగ్రవాదులు లెక్కచేయలేదు. దీంతో భద్రతా బలగాలు చేపట్టిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోందని షోపియాన్ పోలీసు అధికారులు తెలిపారు.
ఇక మరోవైపు అవంతిపొర జిల్లాలోని నౌబాగ్ ప్రాంతంలో కూడా మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులు,భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వారిని కదలికలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్కౌంరట్లో అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ చీఫ్ ఇంతియాజ్ షా హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.
https://twitter.com/ANI/status/1380345855530524673
https://twitter.com/ANI/status/1380402619919736832