జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాదులు లు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్ జిల్లాలోని సౌరా ప్రాంతంలో కానిస్టేబుల్ సైఫుల్లా ఖాద్రీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతని 7 ఏళ్ల కుమార్తె కూడా ఉగ్రదాడిలో గాయపడింది. ఖాద్రీని షేర్-ఐ-కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్) ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు తెలిపారు.
ఇదే విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్లో షేర్ చేశారు. తదుపరి ట్వీట్లో అతని కూతురు కూడా ఉగ్రదాడిలో చిక్కుకుని గాయపడిందని.. పోలీసు కానిస్టేబుల్ గాయాలతో మరణించాడని పోలీసులు తెలియజేశారు.
The injured police personnel succumbed to his injuries and attained martyrdom. We pay our rich tributes to the martyr and standby the family at this critical juncture. @JmuKmrPolice https://t.co/SevScP0shI
— Kashmir Zone Police (@KashmirPolice) May 24, 2022
ఉగ్రవాదులను పట్టుకోవడానికి పోలీసులు ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో ఇటీవల టెర్రరిస్టుల దాడులు పెరిగాయి. రాహుల్ భట్ వంటి కశ్మీరీ హిందువులను హత్య చేయడమే కాకుండా, భారత ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ముస్లింలను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. ఏప్రిల్ 15న కాశ్మీర్లోని గౌష్-బుగ్ గ్రామ సర్పంచ్ మంజూర్ అహ్మద్ బంగ్రూను ఉగ్రవాదులు ఎలా కాల్చి చంపారో మీడియా కథనాలు వచ్చాయి. బంగ్రూ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు, ఏ రాజకీయ పార్టీతో కూడా అతడికి సంబంధం లేదు. ఈ ఏడాది కాశ్మీర్ లోయలో అది 4 హత్య.