పశ్చిమాసియా లో హింసను రాజేస్తున్న ఉగ్రవాద సంస్థలు దగ్గర కోట్ల కొద్ది డబ్బు ములుగుతోందని సైనిక వర్గాలు చెబుతున్నాయి. భూగర్భం లోపల బంకర్లు తయారు చేసి అందులో కోట్లాది నగదు, కిలోల కొద్దీ బంగారం నిల్వ చేస్తున్నారని వివరిస్తున్నారు. ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఐడీఎఫ్ సంచలన వీడియో విడుదల చేసింది.
ఈ మేరకు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ హెజ్బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్ను ధ్వంసం చేశాం. ఆ రహస్య బంకర్లో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించాం. ఇజ్రాయెల్పై దాడులకు ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపింది.
అనేకచోట్ల ఇటువంటి బంకర్లు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ మిలిటెంట్ గ్రూప్నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. ఆ బంకర్పై ఇంకా తాము దాడులకు పాల్పడలేదు. ఆ బంకర్లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ. 4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నాం అని హగారీ పేర్కొన్నారు.
బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు పాల్పడమని, తమ యుద్ధం కేవలం హెజ్బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని పేర్కొన్నారు.
దీనిని బట్టి ఎందుకు ఉగ్రవాద సంస్థలు… కోట్లకొద్ది పోగేసారని తెలుస్తోంది. ఈ డబ్బు తో యువత ను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని అర్థం అవుతుంది.