జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్లోని నౌగామ్ ప్రాంతంలో నివసిస్తున్న బీజేపీ లీడర్ అన్వర్ ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సిబ్బంది ప్రాణాలు విడిచాడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సెంట్రీ తీవ్రంగా గాయపడ్డారని.. అనంతరం ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతున్నారు. ఇటీవల జమ్ములో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. స్థానిక బీజేపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. గత వారం రోజుల క్రితమే.. మున్సిపల్ సమావేశం జరుగుతుండగా.. కాల్పులు జరపడంతో ఓ కౌన్సిలర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.
https://twitter.com/ANI/status/1377513398225661953/photo/2