మహారాష్ట్ర తీరంలో రెండు అనుమానాస్పద బోట్లలో భారీగా ఆయుధాలను గుర్తించారు. రాయ్గఢ్ లోని హరిహరేశ్వర్ బీచ్లో టెర్రర్ బోట్ కలకలం సృష్టిస్తోంది. ముంబైకి 190 కి.మీ దూరంలోనున్న బీచ్ వద్ద స్థానికులు బోటును గుర్తించారు. దానిలో ఏకే-47 తుపాకులు, తూటాలు, మరికొన్ని ఇతర రకాల తుపాకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ఉగ్రవాదుల పడవగా అనుమానిస్తున్నారు. అరేబియా సముద్రం హరిహరేశ్వర్ తీరంలో ఈ అనుమానాస్పద పడవను గుర్తించారు. ఇది స్పీడ్ బోట్ అని తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ముంబై తరహా దాడులకు కుట్ర చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానస్పద బోటు ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు రాయ్గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే తెలిపారు. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందేమో అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.
https://twitter.com/republic/status/1560189519747354624?s=20&t=MymEgED5Xw-4E0qn271DmQ