కామారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్ ను నిరసిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. పెద్దసంఖ్యలో రైతులు కుటుంబాలతో ర్యాలీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తం నెలకొంది. పట్టణంలోని సీఎస్ఐ మైదానం నుంచి కొత్తబస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. పోలీసులు కలెక్టరేట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుంటూ రైతులు ముందుకు సాగారు. పోలీసులు గేటు దగ్గర వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే బైఠాయించారు. అసలైతే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ నెలరోజులుగా రైతులు నిరసనకార్యక్రమాలు చేపడుతున్నారు. అటు రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు.. సాయం చేసేందుకేతామున్నామని… నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.