విజయనగరం జిల్లా రామతీర్థం బొడికొండ పై ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో శిలా ఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. వైసీపీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది..ఘటన జరిగి ఏడాది అవుతున్నా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని… ఏడాదిలో గుడి కట్టి తీరుతామని ఇప్పుడు శంకుస్థాపనకు వచ్చారని అశోక మండిపడ్డారు.