మయన్మార్లో టెన్షన్ వాతావరణం.. సైన్యం నిర్భంధంలో సూకీ.. ఇదంతా డ్రాగన్ పనేనా..?
మయన్మార్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశంలో సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ దేశ నాయకురాలు, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీ(75)ని సైన్యం నిర్బంధించింది. అధికారంలో
ఉన్న నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) ముఖ్య నేతలను అందర్నీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మయన్మార్ తమ నియంత్రణలోనే ఉందంటూ సైన్యం పేర్కొంది. ఏడాది పాటు దేశంలో
ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు సోమవారం నాడు మయన్మార్ సైన్యం ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని పేర్కొంది.
కాగా, మయన్మార్ రాజధాని నేపిడాలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ సారథ్యంలో.. ఎన్ఎల్డీ
పార్టీ అద్భుత విజయం సాధించింది. ఎగువ, దిగువ సభల్లోని 476 స్థానాలకు.. 396 స్థానాలను గెలిచింది. అయితే ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయంటూ సైన్యం ఆరోపిస్తోంది.
సైన్యం చేసిన ఈ ఆరోపణలను సూకీ సర్కార్ ఖండించింది. ఎన్నికల నాటి నుంచే సూకీ సర్కార్కు, సైన్యానికి మధ్య వార్ నడుస్తోంది. ఎన్నికల అనంతరం తొలి పార్లమెంటు సమావేశాలకు సోమవారం నాడు హాజరుకావాల్సి ఉండగా.. సైన్యం తిరుగుబాటు జరిగింది. సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మయన్యార్ విమానయాన శాఖ ప్రకటించింది. సైన్యం కుట్రలను మయన్మార్ ప్రజలు వ్యతిరేకించాలంటూ ఎల్ఎన్డీ పిలుపునిచ్చింది.
సైన్యం తీరుపై భారత్, అమెరికా ఆందోళన
మయన్మార్లో సైన్యం తిరుగుబాటు,ఎన్ఎల్డీ పార్టీ అగ్ర నేతల గృహనిర్బంధంపై భారత్తో పాటు అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు
అండగా ఉంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించగా.. మయన్మార్లో చోటుచేసుకుంటున్న పరిస్థితఉలను నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం పేర్కొంది. నిర్బంధంలో ఉన్నసూకీ,
ఇతర నాయకులను వెంటనే సైన్యం విడుదల చేయాలని కోరింది. మరోవైపు సైనిక తిరుగుబాటు ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్ర విఘాతం అంటూ ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్
ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు.
సైన్యం కుట్ర వెనుక డ్రాగన్ హస్తం
మయన్మార్లో చోటుచేసుకున్న ఈ కుట్ర వెనుక డ్రాగన్ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మయన్మార్లో 90కి పైగా పార్టీలు ఉండగా.. కేవలం 17 పార్టీలు మాత్రమే
ఎన్నికల్లో అవకతవకలైనట్లు ఆరోపించాయి. ఈ పార్టీల్లో యుఎస్డీపీ తప్ప.. మిగిలినవన్నీచిన్న చిన్న పార్టీలే. అయితే వీటిల్లో షాన్ నాషనలైటిస్ డెమోక్రాటిక్ పార్టీ, కాయిన్ పెఒప్లెస్ పార్టీ
లకు బీజింగ్తో అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మయన్మార్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేయడంలో ఈ పార్టీలే ముందున్నాయి.