వెస్ట్ బెంగాల్ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. దాద్పూర్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టీఎంసీ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెస్ట్ మిడ్నాపూర్ ఎస్పీ తెలిపారు. కాగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు.
https://twitter.com/ANI/status/1377461023540568065