జూన్ 26 న, జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇద్దరు సిక్కు బాలికలను అపహరించి మత మార్పిడి చేసిఇద్దరు ముస్లిం లు బలవంతంగా వాళ్ళను వివాహం చేసుకొన్న కేసువెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే బాద్గం జిల్లాకు చెందిన 18 ఏళ్ల సిక్కు బాలికను అపహరించి బలవంతంగా ఇప్పటికే వివాహమైన యువకుడు తో బలవంతంగా వివాహం జరిగింది, శ్రీనగర్ లోని మెహజూర్ నగర్ కు చెందిన సిఖ్ అమ్మాయితన స్నేహితురాలి ఇంటికి ఎదో కార్యక్రమం దృష్ట్యా వెళ్తే అక్కడనుండి ఆమెను అపహరించి ముస్లింగా మర్చి అదే కార్యక్రమానికి వచ్చిన మరో ముస్లిం యువకుడితో బలవంతంగా వివాహం చేసారు. ఆ ఇద్దరు యువకులకు ఇప్పటికే వివాహమై సంతానం కూడాఉన్నాది వారి ఆచూకీ కూడా ఇప్పటివరకు తెలియలేదు దీనిపై ఆగ్రహం చెందిన సిక్కు లు నిరసన ప్రదర్శన చేసి లెఫ్టనెంట్ జనరల్ కు ఉత్తరం వ్రాసారు కాశ్మిర్లోకూడా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ సంఘటనపై మొదటిసారి కాశ్మిర్ లోయకు చెందిన ముస్లిం నాయకులూ విశేషంగాపిడిపి అధినేత మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తంచేశారు.దేశమంతటా అనేకచోట్ల యోజన పూర్వకంగా ముస్లిం మతపెద్దల ప్రోత్సహంతో ఇతర మతస్తుల యువతులను ప్రేమ పేరుతోనో బలవంతంగానో ఎత్తుకెళ్ళి వివాహం చేసుకొంటున్న సంఘటనలు నమోదు అవుతున్నాయి ఈ కేసులలో అప్పటికే వివాహమైన వారుకూడా ఇట్లాంటి వివాహాలు చేసుకోవటం కూడా జరుగుతున్నది. 1990 లో కాశ్మిర్ లోయలో కాశ్మిర్ పండిట్ లపై దాడులు జరగటం వాళ్ళు ప్రాణ రక్షణకు అక్కడి నుండి పారిపోవటం జరిగిన అక్కడి సిఖ్ లు ధైర్యంగా అక్కడే ఉన్నారు వాళ్ళను కూడా భయపెట్టాలని చూస్తున్నట్లు గాఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే 2019 లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లలోభారతీయ మతాలకు చెంది మతపరమైన మైనారిటీలైన హిందూలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు భారతీయ పౌరసత్వాన్ని అందించడానికి చేసిన చట్టం ఆచరణాత్మకంగా ఉన్నది. దానిపై భారత్ లో ఉదారవాదులు సెక్యూలర్ మేధావులు చేసిన నిరసనలను కూడా మనం చూసాము. కానీ కేంద్రం గట్టిగానిలబడింది , ఆ చట్టం అమలు ఎందరో ధన, మాన , ప్రాణాలకు రక్షణ నిస్తున్నది.
భారతదేశంలో జరుగుతున్న ఇస్లాం క్రైస్తవ మతమార్పిడులు కుట్రపూరితమైనవి మరియు దానికి విదేశలనుండి కూడా నిధులు వస్తున్నాయి. మతం మార్పిడి చేయటం తమ హక్కుగా ప్రపంచవ్యాప్తం గా ఇస్లాం క్రైస్తవ మతంవారు భావిస్తూ ఉంటారు దానికి వారు తొక్కని దారులు ఉండవు, మతమే మతం మార్పిడులను తమ మత నిబంధనల హక్కుగా భావించటం మిగిలిన మతాలవారికి ఎంతమేరకు అర్ధమవుతున్నదోప్రశ్నర్ధకమే. ఈ బలవంతపు మతం మార్పిడులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ,కేంద్ర ప్రభుత్వంకూడా మతం మార్పిడులకు కఠినమైన ఆంక్షలతో కూడిన చట్టం తీసుకురావలసిన అవసరం ఉన్నది.కామన్ సివిల్ కోడ్ తీసుకొనరావాలి దానితో బహుభార్యత్వం లాంటి సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు మతం మార్పిడులకు దారితీసే కొన్ని సమస్యలకు కూడా సమాధానం దొరక వచ్చు .శతాబ్దాలుగా మతం మార్పిడులు వన్ వే గా ఉన్నాయి, ఇలా ఇంకా ఎంతకాలం కొనసాగాలి , దీనిపై అందరు ఆలోచించాలి