ఆలయాలపై జగన్ మార్కు రాజకీయం
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం మొదలైన తర్వాత ఒకటీ రెండూకాదు, ఏకంగా 130 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. రథం దహనం, విగ్రహాల ధ్వంసం, అపరహరణ వంటి దారుణాలు జరుగుతున్నా జగన్ సర్కారు పోలీసులు నిందితులను పట్టుకోవడం ఎక్కడలేని తాత్సారం చేస్తున్నారు. ఒక కేసులో మాత్రం ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. కానీ ఇన్ని ఘటనలకు పాల్పడిన వారు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. బహుశా ఈ దేశంలోని పోలీసులు, చట్టాలు తమను ఏమీ చేయలేవని విర్రవీగుతూ ఉండొచ్చు.
జగన్ జమానాలో ఆలయాలపై దాడులతో పాటు బలవంతపు మతమార్పిడులు కూడా పెరిగాయి. సీఎం ఏ మతాన్ని ఆచరిస్తున్నారో ఆ మతం వాళ్లు లేపీ తమ జాగీరుగా చెలరేగిపోతున్నారనే ఆరోపణలు చాలానే వచ్చాయి. సర్కారీ భవనాల్లో, ఆస్పత్రుల్లో, ఆఖరుఉ బడుల్లో మత ప్రచారం ఇష్టారాజ్యంగా సాగుతున్నది. రామతీర్థంతో దారుణం చేసింది టీడీపీ వాళ్లే అని జగన్ ప్రభుత్వం, పార్టీ ఆరోపించడం విశేషం. ఈ ఆరోపణకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. రామయ్య విగ్రహాన్ని ధ్వంసం చేశారనే బాధ మాత్రం వీరిద్దరికీ లేదని అర్థమవుతుంది.
తాజాగా జగన్ ఆలయాలపై తన రాజకీయ ప్రతిభా పాటవాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు భయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణం అనే కొత్త నాటకానికి తెరలేపారు. తొమ్మిది ఆలయాలను పునర్నిర్మిస్తామంటూ శుక్రవారం శంకుస్థాపన అట్టహాసంగా చేశారు. అంతర్వేదిలో ఆలయ రథాన్ని కూల్చితే దుండగుల పని పట్టకుండా కొత్తది బ్రహ్మాండంగా నిర్మిస్తామన్నారు జగన్ పార్టీ నేతలు. ఇంకా ఆలయాల్లో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో భారీ విగ్రహాలు తయారు చేయిస్తామని మరి కొందరు అంటున్నారు. అంతే గానీ దుండగులను పట్టుకోవడం గురించి మాట్లాడటం లేదు. ఒక మతం వారు పనిగట్టుకుని చేసే ఈ దారుణాలపై జగన్ చూసి చూడనట్టు ఉన్నారనేది హిందూ సంఘాల ఆరోపణ. ఇది నిజమే అని జనం అనుకోవద్దంటే పోలీసులకు తమ పని తాము చేసే స్వేచ్ఛ నివ్వాలి. అంతా విశాల హృదయం ఆంధ్రా సీఎంకు ఉన్నదా అనేది ప్రశ్న.