70 ఎకరాల్లో కాదు… 107 ఎకరాల్లో నిర్మితం కానున్న భవ్య రామ మందిరం.
https://twitter.com/PTI_News/status/1367316441150619653
అయోధ్యలో నిర్మితం కాబోతున్న రామ మందిర నిర్మాణం గురించి తెలిసిందే. మొత్తం 70 ఎకరాల్లో మందిర నిర్మాణం చేపడుతున్నట్లు గతంలో ట్రస్టు ప్రకటించింది. అయితే తాజాగా ట్రస్టు ఆ స్థలానికి మరింత స్థలాన్ని జోడించేందుకు రెడీ అయ్యింది. మందిర నిర్మాణం, మ్యూజియం, వసతి గృహాలతో పాటు..ఇతర కట్టడాల కోసం మరింత భూమిని సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న స్థలంతో పాటుగా అదనంగా మరో 37 ఎకరాల వరకు కొనగోలు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం రామ మందిర నిర్మాణ స్థలం 107 ఎకరాలు కానుంది.
జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. రామజన్మభూమి పరిసరాల్లోని 7,285 చదరపు అడుగుల భూమిని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసింది. దీంతో రామ మందిరం ఇప్పుడు 107 ఎకరాల్లో నిర్మితం కాబోతుంది. సుప్రీం తీర్పుతో మందిర ట్రస్టుకు 70 ఎకరాల వరకు స్థలం లభించింది. ఇదంతా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది.అయితే ఇప్పుడు ఆ భూమికి ఆనుకుని ఉన్న ఇతరుల భూములను కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు 107 ఎకరాల్లో రామ మందిరం నిర్మాణం కాబోతోంది.