సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేరుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. 47వ సీజేఐగా జస్టిస్ బాబ్డే 2019 నవంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మార్చి నెలలోనే జస్టిస్ ఎన్వీ రమణ పేరును కేంద్ర న్యాయశాఖకు సీజేఐ బాబ్డే ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సీజేఐ ప్రతిపాదనకు మంగళవారం నాడు ఆమోదముద్ర పడింది. ఏప్రిల్ 24వ తేదీన నూతన సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సబంధించిన గెజిట్ కూడా విడుదలైంది.
కాగా, జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24వ తేదీన 48వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనది ఆంధ్రప్రదేశ్లోని ఓ రైతు కుటుంబం. గతంలో ఆయన ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 సంవత్సరంలో నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఉన్న సీజేఐ ఎస్ఏ బాబ్డే ప్రతిపాదనతో 48వ సీజేఐగా కొనసాగనున్నారు.
President Ram Nath Kovind appoints Justice NV Ramana as the next Chief Justice of India, with effect from 24th April 2021: Government of India
CJI SA Bobde is due to retire on April 23rd. pic.twitter.com/60LucNp3yH
— ANI (@ANI) April 6, 2021