తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ మేరకు ప్రజల్ని అప్రమత్తం చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుంది.
అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని తెలిపారు.మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C – 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C – 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C – 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 36°C – 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం .
రాష్ట్రంలో ఈ సీజన్లో నిన్న అధిక ఉష్ణోగ్రతలు నమోదు
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8°C, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7°C, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పలు జిల్లాల్లో మొత్తంగా 13మండలాల్లో 46డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42°C -44°C ల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు
క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు ఇస్తున్నారు.
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి.వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.