తెలుగు ప్రజలకు సినిమాలతో ఉండే అనుబంధం అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ ఎక్కువ సినిమాలు నిర్మాణం అయ్యేది మాత్రం తెలుగు భాషలోనే. అంతేకాకుండా తెలుగు సినిమాలు విస్తారంగా వివిధ భాషల్లోకి డబ్ అయి,, అక్కడ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి.
అంతేకాదు ,, అత్యధిక తెలుగు సినిమా థియేటర్లు ఉన్నది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే. మరో వైపు ,,ఎక్కువ థియేటర్ రిలీజ్ కూడా ఇక్కడే జరుగుతాయి . ఒకప్పుడు సినిమా థియేటర్లు అంటే చాలా చాలా బ్రాండ్ ఉండేది. ఓం మోస్తరు పట్టణాల్లో సినిమా ధియేటర్ ఓనర్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ రోజు టిక్కెట్లు కావాలంటూ పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తుండేది. దీంతో ఆయా పట్టణాల్లో థియేటర్ ఓనర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండేవారు.
కానీ ఇదంతా గత వైభవం. మల్టీప్లెక్స్ థియేటర్ లు వచ్చిన తర్వాత మామూలు సినిమా థియేటర్ల పరిస్థితి దిగజారిపోయింది. టెలివిజన్ ఛానల్స్ లో సినిమాలు ప్రసారంతో ఈ పరిస్థితి ఇంకా కష్టతరంగా మారింది దీంతో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లో ఓనర్లు కఠిన నిర్ణయానికి వచ్చారు.
ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ చేశాయి. సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని ఆయా సినిమా థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటీటీ, కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ లు వచ్చిన తర్వాత చిన్న తరహా థియేటర్లు మూసివేసుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చిన్న తరహా థియేటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, స్వచ్ఛందంగా పది రోజుల పాటు థియేటర్లను బంద్ చేస్తున్నట్లు బోర్డులు వేశారు.
పది రోజులపాటు చిన్న సినిమా థియేటర్లో అన్ని మూతపడుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని తమను కాపాడాలని, ఈ థియేటర్ల మీద ఆధారపడి వేలమంది చిన్న ఉద్యోగులు పనిచేస్తున్నారని చెబుతున్నారు.