మిస్ ఇండియాగా తెలుగమ్మాయి మానస
వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా-2020 గా వారణాసి మానస (23) ఎంపికైంది. 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస ఉంటుంది. రన్నరప్గా ఉత్తరప్రదేశ్కు చెందిన మాన్యా సింగ్, మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానికా షియోఖండ్ నిలిచారు. మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు. ఇంజినీరింగ్ చదివిన మానస…ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్గా పనిచేస్తోంది.
నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పికాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి రౌండ్కు మిస్ వరల్డ్ ఏషియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.