తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు అందించారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకానుంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేసిన కేసీఆర్ రాష్ట్రంలోని 80,039 ఉద్యోగాలు భర్తీచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో 91142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 80,039 ఉద్యోగాల భర్తీకి గానూ నోటిఫికేషన్ ఇవాళే విడుదలవుతోందని సీఎం ప్రకటించారు. 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామనీ ఆయన ప్రకటించారు.
అటు గరిష్ట వయోపరిమితినీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 49ఏళ్లు, దివ్యాంగుల వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించినట్టు కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.