తెలంగాణ అంతట పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండుతున్నాడు. ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అందుచేత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో రానున్న 4 రోజులూ కీలకం అంటున్నారు. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతుంది అని అంటున్నారు.
కరీంనగర్,నల్గొండ,సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్నగర్, భూపాలపల్లి లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4,5 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్లో హై టెంపరేచర్స్ ఉంటున్నాయి. నేడు 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 4, 5 తేదీల్లో 18 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేస్తున్నారు . మిగతా జిల్లాలకు 4 రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ ఇస్తున్నారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే తలకు గుడ్డ చుట్టుకోవడం కానీ టోపీ పెట్టుకోవడం కానీ చేయాలి అని చెబుతున్నారు.