తెలంగాణ విమోచనం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా….రాష్ట్రవ్యాప్తంగా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్లో యువసమ్మేళనం నిర్వహించారు. దక్షిణ మధ్యక్షేత్ర ధర్మజాగరణ్ ప్రముఖ్ అమరలింగన్న గారు ముఖ్యవక్తగా హాజరయ్యారు. నిజాంపాలనలో రజాకార్ల అకృత్యాలను ఎదిరించి ఎందరో అమరులయ్యారని వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆత్మగౌరవ తెలంగాణ కోసం అందరూ పాటుపడాలని పిలుపుచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.