భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు కార్యక్రమం లో ఎన్ రామచంద్ర రావు గారు తెలంగాణా అవిర్బవం లో భారతీయ జనతా పార్టీ పాత్ర ను సబికులకు తెలియచేసారు, తెలంగాణా సాదించడంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన పాత్ర ను కొనియాడారు.
కేంద్ర ప్రబుత్వం తెలంగాణా అభివృద్ధి కోసం ఏ రకంగా సహకరిస్తుంధో తెలియచేస్తూ , స్మార్ట్ సిటీస్ ని ఏరకంగా అభివృద్ధి పరచవచ్ఛో తెలియజేసారు , దీని కోసం BJP /కేంద్ర ప్రభుత్వం /మోడిగారు అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి కోసమా కేంద్ర , రాష్త్రా ల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలని వెల్లడిస్థ్హూ , తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణా ప్రవాస భారతీయులు ని సహక రించాలిసేందిగా విజ్ఞప్తి చేసారు.
అవినీతి నిర్మూలన , విద్య వ్యాప్తి , గ్రామీణా నీటి సరపరా , తాగు, సాగు నీటి ప్రాజెక్ట్లు , అవసరముంది అని అన్నారు . గ్రామిణా ప్రాంతం లో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తు సరపరా , విద్యార్థులకు వసతి గృహాల సదుపాయం , బలహీన వర్గాలకి పక్క గృహా సదుపాయం వంటి నిత్యావసర పనులను సాదించినపుడు బంగారు తెలంగాణా ను సాదించగలమని తెలియచేసారు
ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ (OFBJP ) నిర్వాహించిన ఈ సభలో కృష్ణారెడ్డి అనుగుల (అఫ్-బీజేపీ జాతీయ పూర్వ అధ్యక్షులు ), విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్) సహా ప్రవాసతెలుగువారు హాజరయ్యారు…