తెలంగాణలో ప్రభుత్వం మారాక.. పాత నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అనేక చోట్ల పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి వీటిలో చాలావరకు భూములు కబ్జా, ఆక్రమణలు బెదిరింపులకు సంబంధించిన కేసులే కావడం విశేషం. తాజాగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద పోలీసు కేసు నమోదు అయింది.
జీవన్ రెడ్డి తో పాటు అతని కుటుంబ సభ్యుల పై చేవెళ్ల పి ఎస్ లో కేసు నమోదు చేశారు.
దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా పెట్టారు అని చెప్తున్నారు.
చేవెళ్ల కు సమీపంలోని
ఎర్లపల్లి లో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి కొనుగోలు చేశారు.
సర్వేనెంబర్ 32, 35 , 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. దామోదర్ రెడ్డి భూమికి పక్కనే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి ఉన్నది. చాలా కాలం క్రితమే దామోదర్ రెడ్డి భూమి మీద కన్నేసినట్లు తెలుస్తోంది.
2023లో ఫంక్షన్ హాల్ ను కూల్చేసి , దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు చెబుతున్నారు.
కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను జీవన్ రెడ్డి నియమించారు. ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలతీసేందుకు దామోదర్ రెడ్డి వెళ్ళారు. కానీ,
దామోదర్ రెడ్డి పై పంజాబీ గ్యాంగ్ తో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాడి చేయించారని ఆరోపిస్తున్నారు.
మరణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేశారు. ప్రభుత్వ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావడంతో జీవన్ రెడ్డి జోలికి వెళ్లేందుకు దామోదర్ భయపడిపోయారు.
ఇప్పుడు ప్రభుత్వం మారాక పోలీసు కేసు పెట్టించారు.ఈ
ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు బాధితుడు దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
447 427 341 386 420 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
మొత్తం మీద రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అనేక చోట్ల టిఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూముల కబ్జా వ్యవహారాలు బయటకు వస్తున్నాయి వీటి మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే చాలా విషయాలు వెలుగు చూస్తాయి.