మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా బీర్ల అమ్మకంలో సౌత్ ఇండియా లోనే నంబర్ 1 గా నివేదికలో వెల్లడైంది. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తున్నారని కేసీఆర్ పై విపక్షాలు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నాయి. ఈ నివేదిక నేపథ్యంలో ఇటీవల బీజేపీలో చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి ట్వీట్ వైరల్ గా మారింది. ఈ విషయమై ఆయన సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నిక, ఈ నివేదికను ముడిపెడుతూ కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
తెలంగాణను నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ కు అభినందనలు. మునుగోడులో ఉప ఎన్నిక ఉన్నందున.. మీరు విస్కీ విక్రయాల్లో కూడా నంబర్ 1 గా ఉంటారని నేను కచ్చితంగా అనుకుంటున్నానంటూ విశ్వేశర్ రెడ్డి ట్వీట్ చేశారు.
https://twitter.com/KVishReddy/status/1555405059076239360?s=20&t=7E0aGk1OfqOgy5aZ_lbpiw