ఎన్డీటీవీ బోర్డు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికారాయ్. వారి స్థానంలో సంజయ్ పుగాలియా, సెంథిల్ చెంగల్వరాయన్ నియామకాన్ని బోర్డ్ ఆమోదించింది.
https://twitter.com/ani_digital/status/1597734708833837056?s=20&t=Q24fG3Wa6jEqUhmJMZQN5g
ప్రణయ్ రాయ్ సారథ్యంలోని న్యూడిల్లీ టెలివిజన్ లిమిటెడ్ ఎన్డీటీవీని భారత బిలియనీర్ గౌతం ఆదానీ టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. సంస్థ టేకోవర్ ను బిజినెస్ లా కాక బాధ్యతలా చూస్తున్నట్టు ఆదానీ చెప్పుకొచ్చారు.
1988లో ప్రణయ్ రాయ్, రాధికారాయ్లు ఎన్డీటీవీని స్థాపించారు. అయితే ఇటీవలే ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆదానీ గ్రూప్ మెజారిటీ శాతం వాటా కొనుగోలు చేసింది. తమ సంస్థ టేకోవర్ చేసిన తర్వాత కూడా ఎన్డీటీవీ చైర్మన్గా కొనసాగొచ్చునని ప్రణయ్రాయ్ని మొదట్లో ఆహ్వానించినా తరువాత తక్షణమే అమలులోకి వచ్చేలా RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో సంజయ్ పుగ్లియా, సెంథిల్ చెంగల్వరాయన్లను డైరెక్టర్లుగా నియమించింది.
అటు ఆదానీ వశమైన ఎన్డీటీవీ చానల్ ను ఇక చూడబోనన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇప్పుడే అన్ ఫాలో చేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎన్డీటీవీ డైరెక్టర్గా ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ దిగిపోయారన్న ఏఎన్ఐ వార్తా కథనాన్ని ట్వీట్ కు జతచేశారు కేటీఆర్.
https://twitter.com/KTRTRS/status/1597799210153545728?s=20&t=Q24fG3Wa6jEqUhmJMZQN5g