ఫలితాల కోసం http://tsbie.cgg.gov.in వెబ్సైట్ను చూడండి .
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. రాష్టర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈరోజున ఇంటర్ ఫస్టియర్, సెకండీయర్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఇందులో ఫస్టియర్ 4,33,082 మంది హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించగా ఫస్టియర్ ఉత్తీర్ణత 62.85 శాతంగా సెకండీయర్ ఉత్తీర్ణత 67.27 శాతంగా నమోదైంది. రెండుసంవత్సరాలు కలిపి 61.68శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా ఈసారి కూడా 68.68శాతంతో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలురు బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…విద్యార్థి దశలో ఇంటర్ అనేది కీలకమైంది. జీవితానికి టర్నింగ్ పాయింట్. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీని తీసేస్తున్నామని ప్రకటించారు. పిల్లలు ఎవరూ కూడా ఒత్తిడికి గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు 1473 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించాం. మన రాష్ట్రంలో ఫస్టియర్, సెకండియర్ 9,45,153 మంది హాజరయ్యారు.. 26 వేల మంది సేవలందించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పారు.